Vyas creations stories

Every story contain a lesson or give entertainment while reading. Written by: R. Sucharitha

Tuesday, May 5, 2020

paalu kalthoyi.... neellu kalthoyi - పాలు కల్తోయి ..... నీళ్ళు కల్తోయి

పాలు కల్తోయి ..... నీళ్ళు కల్తోయి
లాభాపేక్షమెండోయి
అందుకే సరుకులన్ని  కల్తోయ్

ప్రజా క్షేమమే మా లక్ష్యమని చాటోయ్
పదవులన్ని బంధువులకే అందునోయ్ 
అడుగులకే మడుగులొత్తే వారికే అధికారముండోయి
అధికార వ్యామోహం నిండోయ్
అందుకే రాజకీయం కల్తోయ్

స్వకార్యం తీర్చు స్వాములకేనోయ్
సంపాదకీయాలన్ని సపోర్టిచ్చోయ్
అవకాశవాదం మెండోయ్
అందుకే కొన్ని పత్రికలు కల్తోయ్

నోటుకే మనవోటు కాదోయ్
నీతికి నిజముగా వెయ్యవోయ్

స్వబుద్ధి సుబుద్ధి పరబుద్ధి వినాశం
గురుబుద్ది శ్రేష్ఠమోయ్
బోధిస్తున్నా గురువుగా....
అర్థిస్తున్నా కవిగా.... ఆలోచించమని....
ఇది మాత్రం కల్తీలేని నిజమోయ్                           - డా. ఆర్. సుచరిత 

Friday, November 17, 2017

telangana nataka rangam

రవీంద్రభారతి                                                                                                                               19-07-2015
తెలంగాణ నాటక రంగం - తెలంగాణా కళ ప్రస్థానం
సుచరిత రామానుజపురం (Ph. D.)
    
నా తెలంగాణా కోటి రతనాల వీణ 
తెలంగాణ కళా  నాటక రంగాన్ని సుసపన్నం చేసిన కళాకారులకు కోటి దండాలు 
స్వరంతో , నటనతో , నాట్యంతో కళ రంగానికి సప్త వర్ణాల సొబగులు అద్దిన మహామహుల 
మహోజ్వల తెలంగాణా నా పుణ్యభూమి ... ధన్యభూమి. 

    ఎందరో కళాకారులు తెలంగాణా గడ్డమీద గజ్జకట్టి నటరాజుకి నీరాజనం పలికారు. నాటకరంగాన్ని నవ్యపథం వైపు నడిపించారు ... కళకళలాడించారు . 

    ఒకప్పుడు తెలంగాణాలో నాటకరంగం ఫరిఢవిల్లింది. అపట్లో ప్రజలకు కాలక్షేపం నాటకమే సామాజిక స్ప్రుహగల అంశాలు , స్వాతంత్ర్యోద్యమ్మంలో స్పూర్తిని కలిగించే నాటకాలు ప్రజల కొరకు , ప్రజల మధ్య ప్రధార్శించాబడ్డాయి. కళాకారులు నాటకాన్ని వృత్తిగా స్వీకరించిన, పరితోశకం మాత్రము అందలేదు, వారు అంతగా ఆశించలేదు. వాళ్ళలోని నటనా తృష్ణ ఒక తీరని దాహంగా తపనకు పరాకాష్టగా మిగిలింది. 
    
   చతుర్విదభినయాలతో ప్రజలను రంజింపచేయడానికి స్పూర్తిని కలిగించడానికి నాటకరంగాన్ని ఒక మాధ్యమంగా ఎన్నుకొన్నారు, ఒక ఆశయంగా భావించారు. 

    రాజకారుల మీద కొనసాగిన సాంస్కృతిక పోరాటంలో నాటకం ప్రముఖ పాత్ర వహించిన కారణంగా దొరలచే , నైజం ప్రభుత్వంచే అణిచివెతకు గురైంది, కళాకారులు హింసించబడ్డారు. దొరల నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన నాటకాలు , ఒక సామాజిక బాధ్యతను  బ్రతికించాయి. 

    భారత ప్రభుత్వం సైనిక చర్య ద్వారా నైజాం ఏలుబడిలో ఉన్న మన తెలంగాణా రాష్టాన్ని విలీనం చేసుకుంది. ఆ స్వేచ్చ , స్వాతంత్ర్యం దొరికింది అన్న ఆనందం పట్టుమని పదికాలాలపాటు నిలవకముందే ఆంధ్ర రాష్టంలో విలీనం చేసి మళ్లి పారాయి పాలనకు తెర తీసింది. సుధిర్ఘంగా సాగిన తెలంగాణా పోరాటంలో ఎంతోమంది బలియ్యారు , చివరకు __ (19  - 2013) ఇన్నేళ్ళ తర్వాత తెలంగాణా సాదించింది. నైజాం చేర నుండి బయటపడిన తెలంగాణా ప్రజలు ఆంద్ర పాలకుల వలలో చిక్కి నిరాదారణకు గురైయ్యారు. అయినప్పటికీ వివిధ రూపాలలో తన శక్తి , సత్తాను చాటుతూ తన ఉనికిని కాపాడుకుంది. నైజాం ప్రభుత్వం అణిచివెతకు ఆంద్ర పాలకుల వివక్షకు చిక్కి శల్యమైంది. 

    ఇదిలా ఉండగా మరోపక్క T.V. మాధ్యమం , సినిమారంగం , మల్టీప్లెక్స్ ల కల్చర్ , నాటకరంగ తిరోగమనానికి తల ఒక చేయి వేసాయి. నాటక కళాకారులు విధిన పడిన దుస్థితి వచ్చింది. 
* ఆర్ధిక పరమైన ప్రోత్సాహం లేకపోవడం ముఖ్య కారణం. 

కొసమెరుపు :
    ఒక చిన్న ఆశ కిరం వేణవేల వెలుగులతో నాటక రంగాన్ని తేజోమయం చేస్తుందన్న నమ్మకానికి తెలంగాణా ప్రభుత్వం ఒక సాక్షి సంతకంగా మారనుంది. నాటకరంగాన్ని ప్రోత్సహించడం. తెలంగాణా సాంస్కృతిక విభాగాన్ని మరింత ఆరోగ్యంగా తీర్చిదిద్ధడానికి ప్రయత్నించడం ఆశావాద దృక్పథాన్ని సూచిస్తున్నాయి. 

    తెలంగాణా ప్రత్యేక రాష్టంగా ఏర్పడిన శుభ సందర్బంలో సంబురాలు జరుపుకుంటున్న వేళ, నాటక రంగం తన పూర్వ ప్రాభవాన్ని సంపాదించుకుంటుంది అని ఆశిద్దాం. 

   తెలంగాణా నాటక రంగానికి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో తిరిగి పూర్వ వైభవాన్ని అందుకుంటుంది అని పూర్తి విశ్వాసం ఉంది.  

Objects:
1. తెలంగాణా కళాకారులకు, వారి కుటుంబాలకు ఉచిత భోజన వసతులు కల్పించాలి. 
2. ఒక్కొక్క కళాకారులకు కనీసం ఒక్క గది అయిన కట్టించి ఇవ్వాలి. 
3. కాలుష్యం , పర్యావరణం , ఉగ్రవాదం , నిరుద్యోగం లాంటి సామాజిక సమస్యలపై నాటకాలను ప్రదర్శించడం. 
4. నైపుణ్యం కలిగిన కళాకారులకి నాటక ప్రదర్శనంలో అవకాశం కలిగించడం.
5. నాటకరంగ కళాకారుల పిల్లలకు ఉచిత విద్యను ఏర్పాటు చేయడం. 
6. కళాకారులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సౌకర్యాలు కలిపించడం. 
7. నాటక రంగ కళాకారులకు పెన్షన్ సౌకర్యం కలిగించడం. 
8. ముఖ్యంగా మహిళా కళాకారులకు అన్ని నాటక రంగ విభాగాలలో తర్ఫీదును ఇచ్చే గురుకులాలను ఏర్పాటు చేయాలి. 
     ఇలాంటి ఆశయాలతో ఒక ధార్మిక సంస్థ ఏర్పాటు చేయాలి. 

     చాల దేవాలయాలకు మాన్యాల పేరిట భూములు ఉంటాయి. వాటి మీద వచ్చే ఆదాయాలతో దేవాలయాలు స్వయముగా నిర్వహించాబడుతుంటాయి. ఒకవేళ భక్తులు దక్షిణ ఇచ్చినా , ఇవ్వక పోయిన గుడి కార్యక్రమాలకు, అర్చకుల జీతభత్యాలకు కొదువ లేకుండా మాన్యాలమీద వచ్చే ఆదాయముతో నిర్విఘ్నముగా నిర్వహించాబడుతుంటాయి. కళా ప్రదర్శనలతో సకల జనాలను సజ్జనులుగా మార్చే ఈ ధార్మిక సంస్థకు కూడా దేవాదాయ మాన్యాల వలె భూములను సమ కూర్చాలి. అప్పుడే నిరంతరమూ నిజమైన కళాకారులతో సామాజిక ప్రయోజనార్తమైన నాటకాలను ప్రదర్శించి, సౌఖ్య మరియు సంక్షేమ సమాజమును ఏర్పాటు చేయగలుగుతాయి . అందుకే ఇలాంటి ఒక ధార్మిక సంస్థను ఏర్పాటు చేసి స్వయంప్రతిపత్తితో మనగలిగింపజేయు, స్వయంపోషక స్థితిని కల్పించుటకై , స్థిరచరాస్తులను సమకుర్చాలి . 

Friday, July 15, 2016


పాఠకులకు సినిమా ఛాన్స్-Film chance

అతి త్వరలో ఈ నవల ఆధారంగా సినిమా నిర్మించబడబోతుంది.
ఈ చిత్రంలో నటించాలనే ఆసక్తి గల పాఠకులకు అద్భుత అవకాశం.
ఈ నవల కొన్నట్టు ఏ ఒక్క ఆధారమైన మా ఈమెయిలు అడ్రస్ కి పంపించండి.
మాకు చేరిన ఎంట్రీల ప్రాథమిక పరిశీలన అనంతరం వాటిలో ఎంపిక చేయబడిన కొంత మంది ఫిల్మ్ ఆడిషన్ కి పిలవబడతారు.

ఆడిషన్ లో ఎంపిక చేయబడ్డవారికి ఈ చిత్రంలో నటించే అవకాశం ఇవ్వబడును.
ఆసక్తి గలవారు ఈ నవల లోని ఏదైనా ఒక పాత్రను ఆడిషన్ లో నటించి చూపించవలసి ఉంటుంది. కావున ఏదైనా ఒక పాత్రని ఎంపిక చేసుకొని, బాగా ప్రాక్టీసు చేయండి.

Attachments:
1. This novel purchase receipt or Evidence.
2. Close up, middle and long photographs.
3. Personal details like color, height etc..
4. Contact details.

E-mail address:
risingstar4tomorrow@gmail.com


www.sucharithafilmuniversity.com

Monday, November 17, 2014

Cinema Draft to Nalsaar from Sucharitha

Dr. సుచరిత రామానుజపురం (Ph.D. Theatre arts) Actress &Director సూచించినవి
      ఏ విషయానైన , సమాచారానైన తెలియజేసేది మరియు ప్రభావితం చేసేది  MEDIA అందులో శక్తివంతమైనది   ప్రింట్ మీడియా మరియు సినిమా మీడియా. ఇపుడున్న వ్యవస్థలో వీటి వాళ్ళ మహిళలకు జరుగుతున్న కీడుని నిరోధించి , వారి అభివ్రుధిని కాంక్షిస్తూ కొన్ని సూచనలు మరియు చట్టలో ఉన్న వాటికీ చేయవలసిన సవరణలను క్రింద ప్రతిపాదించాను.

సినిమా దాని ప్రభావం:





కథనాయిక  అంటే కథకి నాయిక . కానీ ఈ రోజుల్లో కథానాయకుడి చుట్టూ తిరగడమే కథానాయిక అన్నట్టుగా నిర్మిస్తున్నారు . skin show and dance కి మాత్రమే పరిమితం చేస్తున్నారు .  అసలు సృష్టికి మూలం స్త్రీ.  అలాంటి స్త్రీకి ఆలోచన శక్తి లేనట్టు  చూపిస్తున్నారు. శక్తి స్వరూపం అయినా  స్త్రీని  నిస్సహాయురాలిగా, హీరోను ప్రేమించడమే తప్ప మరో  లక్ష్యం ఏమి లేనట్టుగా నిర్మిస్తున్నారు.  ఇలా చెప్పుకుంటూ పోతే నేటి చిత్రాలలో స్త్రీల పాత్రల చిత్రీకరణపై  చర్చించే అంశాలు ఇంకా  కొకొల్లలుగా  ఉన్నాయి.

1. మహిళలకు ఉచితంగా నటన, దర్శకత్వం మరియు సినిమాకు సంబంధించిన ఇతర శాఖలలో శిక్షణ ఇవ్వాలి . దానివల్ల మహిళలకు సంబంధించిన అంశాలను, వివక్ష లాంటి వాటిని శ్రద్ధగా  గమనించి దానికి సంబంధించి తగు చర్యలు తీసుకోవచ్చు .

2. మహిళలకు సంబంధించిన చిత్రాలను ప్రభుత్వమే నిర్మించాలి .

3. మహిళలకు సంబందించిన చిత్రాలను నిర్మించే మహిళలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి .

4. చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ లాగే women's film festival నిర్వహించాలి .

5. మహిళల పై జరిగే ఆకృత్యాలను అరికట్టే విధంగా school & colleges లో స్త్రీని గౌరవించే విధంగా లఘు చిత్రాలను నిర్మించి ప్రదర్శించాలి . అలాగే software company etc. లలో ప్రదర్శించాలి .

6. మహిళలకు సంబంధించిన కథాంశంతో మహిళలు నిర్మించే చిత్రాలకు సబ్సిడీ ఇవ్వాలి లేదా నిర్మాణానికి అవసరమయ్యే  పరికరాలపై తగ్గింపు ఇవ్వాలి.  కనీసం నిర్మాణానికి ఖర్చు అయ్యే మొత్తంలో 50% ప్రభుత్వం భరించాలి .

7. ముఖ్యమైన మహిళ చిత్రాలపై వినోదపు పన్ను మినహాయించాలి.

8. ముఖ్యమైన మహిళ చిత్రాలను ప్రదర్శించుటకు ప్రదర్శన శాలలు / theatresని కేటాయించాలి , అవసరమైతే థియేటర్ ని నిర్మించాలి .

9. స్వయంప్రతిపత్తి & స్వయంపోశక స్థితితో మనగలిగే మహిళా ఫిల్మ్ charitable  ట్రస్ట్ ని ఏర్పాటు చేసి, దానికై  పూర్తిస్థాయి చిత్రాన్ని నిర్మించగల సామర్ధ్యం గల స్టూడియోని నిర్మించాలి, అలాగే కళాకారిణిల పోషణకై,  పూర్వపు దేవాలయ మాన్యపు భూములు వలె ఈ ట్రస్ట్ కి కూడా తగినన్ని భూములను కేటాయించాలి. 

10. School, college &University లలో Sports Section ఉన్నట్టు Culture Section కూడా కచితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.  ( సంగీతం, నృత్యం , నాటకం ప్రజలపై ఎంతో ప్రభావితం చూపిస్తాయి. దీనికి చరిత్రలో ఎన్నో సాక్షాలు కూడా ఉన్నాయి. అలాగే ఇది మానసిక ఎదుగుదలకి, సామాజిక సృహకి మరియు  లోక జ్ఞానానికి ఎంతోగానో తోడ్పడుతుంది. )

11. Theatre Arts లో M.A. / M.P.A. , M.Phil & Ph.D. చేసిన students కి ముఖ్యంగా విధ్యార్థిణిలకు  School, college & University లోని Culture Section లో ఉపాధి అవకాశం కల్పించాలి.

12. ప్రభుత్వం  నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో Theatre Arts చదివిన విధ్యార్థిణిలకు అవకాశం కలిగించాలి.

13. లలితకళలు చదువుతున్న విధ్యార్థిణిలకు ప్రతినెల scholarship/ fellowship ని ప్రభుత్వం అందించాలి. ( సంగీతం , నృత్యం, శిల్పకళ, చిత్రకళ మరియు నాటకం లాంటివి నేరుచుకునే విధ్యార్థిణిలకు ఇతర courses చేసే వాళ్ళల ప్రోత్సాహకాలు ఉండవు. కారణాలు అనేకం అందులో ముఖ్యంగా  ఉపాధి అవకాశం లేక పోవడం. అందుకే వారికీ ఆర్ధిక సహాయం చేయాలి. )

14. సినిమాలు చూసి ప్రజలు అందులో youth త్వరగా ప్రభావితం చెందుతారు అన్న విషయాన్నీ అందరు ఒప్పుకొని తీరాల్సిందే . ( అతడు సినిమా చూసి B.Tech విద్యార్థి దొంగతనాని పాల్పడడం, ఖడ్గం సినిమా చూసి ఓ పిల్లవాడు అతని తోటి బాలుడి గొంతుని బ్లేడ్ తో  కోసాడు , bollywood సినిమా చూసి దొంగతనాలకి పాల్పడిన ఉదంతం ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో అంశాలు ఉన్నాయి. ) ఇపుడు పెట్టుబడిదారులు కేవలం లాభాపేక్ష తో వారు ఇష్టం వచ్చినట్టు సినిమాలో అమ్మాయిలను అంగడి బొమ్మల చూపిస్తూనారు , శృంగార ప్రేరకమైన దృశ్యాలు చూపిస్తున్నారు దీనివల్ల అమ్మాయిలపై అఘత్యాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి . కొంతమంది porngraphy కి కూడా గురి అవుతున్నారు.

15. మణిపురి లో Bollywood సినిమాల పై నిషేధం విధించారు. ( వారి చట్టం ఎంత పటిష్టంగా ఉందంటే చివరికి భారతదేశానికే  పేరు తెచ్చిన 3 times ఒలింపిక్ చాంపియన్ Marykom స్వీయ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన Marykom సినిమాని కూడా విడుదల చేయలేదు. ) కారణాలు సహేతుకమ? ఆహేతుకమా అనేది అనవసరం . ఒక రాష్ట ప్రభుత్వానికి ఇలాంటి వాటిని నిషేధించే అధికారం ఉంది. కావున మన తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమాలపై నిషేధం విధించే  అధికారం ఉందని తెలుస్తుంది . కనుక కేవలం లాభాపేక్షతో మరియు డబ్బు & అధికారం తో ప్రజలను తప్పు దోవ పట్టించే సినిమాలు , యువతను తప్పుదోవ పట్టిచే సినిమాలు మితిమీరిన sex, violence and crime తో నిర్మించే చిత్రాలను, ముఖ్యంగా మహిళల అంగాంగ ప్రదర్శన, చుంభన మరియు  అశ్లీల ప్రదర్శనే  కథాంశంగా తెరకేకించే అశ్లీల చిత్రాలను నిషేధించాలి. 

16. మహిళలు ఆర్ధికంగా వెనుకబడి ఉంటారు కాబట్టి, చిత్ర నిర్మాణంలోని ప్రతిశాఖలో మహిళలకు ఉచితంగా కార్డు ఇవ్వాలి.

ప్రింట్ మీడియా మరియు ప్రకటనల ప్రభావం:
శ్రీశ్రీ గారు  " కుక్క పిల్ల ,సబ్బుబిళ్ళ , అగ్గిపుల్ల కాదేది కవితకు అనర్హం " అన్నట్టు. చాక్లెట్ ప్రకటకైన , పళ్ళు తోముకొనే పేస్టు అయిన , సెంట్ అయిన కాదేది మహిళా అంగాంగ ప్రదర్శనకు అనర్హం అన్నట్టు తీస్తున్నారు/ చిత్రిస్తున్నారు నేటి ప్రకటన కర్తలు.
                న్యూస్ పేపర్ లో, హోర్డింగ్స్ లో, ప్రకటనలలో మహిళలను కురచ దుస్తులలో చూపుతూనారు, వివిధ భంగిమలతో యువతను రెచ్చగొట్టే విధంగా చిత్రిస్తున్నారు.
సీరియల్ :
         స్త్రీ అంటే ప్రేమ స్వరూపం అని అంటారు, కాని నేటి సీరియల్స్ లో  విలన్ లుగా చిత్రిస్తునారు, స్త్రీ అంటే అన్ని ఉన్న సమస్య సృషించే సుర్పణక లాంటి పాత్రలే చుపిస్థునారు. ఇంట్లో ఉండే గృహినిలను ఇంకా మజ్జుగా తయారు చేస్తున్నారు, అర్ధం పర్ధంలేని అభిప్రాయాలూ ఏర్పడేలా చేస్తున్నారు.

1. ప్రింట్ మీడియా , ప్రకటనలో మరియు సీరియల్ లో నిర్మాణ విభాగం లో ఉదా : దర్శకత్వం, రచన మొదలైన వాటిలో మహిళలు 50% నియమించాలి, ఉద్యోగంలో భర్తీ చేయాలి .

A . శ్రీదేవిగారు సూచించినవి
1. అసంగటిత మహిళల కేంద్రాల వద్ద, అక్కడి స్థానిక సమస్యలపై లఘు చిత్రాలను నిర్మించాలి. 
2. school & colleges, software company, అసంగటిత మహిళల కేంద్రాలు etc. వద్ద మహిళలను educate చేసే, వారిలో social, సెల్ఫ్-employeement లాంటి వాటిపై awareness create చేసే లఘు చిత్రాలను నిర్మించాలి.

Wednesday, August 27, 2014

నాటకంలో జానపద కళల ప్రయోగం

నాటకంలో జానపద కళల ప్రయోగం

రామానుజపురం సుచరిత
M.A. Theatre arts, ( PhD),
రంగస్థల శాఖ,
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం,
హైదరాబాద్. 

    నాటకంలో జానపద కళల ప్రయోగం గురించి  మాట్లాడితే కొన్ని రోజులు పడుతుంది, అలాంటి అంశం గురించి రాయాలంటే 2/3 పేరాలు సరిపోవు. అందుకే జానపద కళల గురించి, అలాగే వాటికీ నాటకానికి ఉన్న సంబంధం గురించి, వాటి ప్రయోగాల గురుంచి క్లుప్తంగా వివరించాను.

    జానపద కళల నుంచి ఉద్భవించిందే సంగీత, నృత్యం, రూపకం ఈ విషయాన్ని G.V. సుందరం గారు అలాగే ప్రపంచ మేధావులు కూడా ప్రకటించారు. మొదట సంస్కృత నాటకాలని కావ్యాలుగా అనువాదించారు, కాని రూపకంగా అంటే drametic form గా అనువాదించలేదు. కాని అప్పటికే folk theatre ఈ సంస్కృత నాటకాలని గ్రామీణ ప్రజలకు చేరువ చేసాయి. ప్రజలకు వినోదాన్ని అందించాయి, విజయవంతంగా నడిచాయి. అప్పటి వారివారి కాల పరిస్థితులను అనుసరిస్తూ వారి సౌలభ్యం మేర అక్కడి ఆచారాలను అనుసరిస్తూ, వారి యొక్క విధమైన శైలిలో సంప్రదాయబద్ధంగా అభివృద్ధి చెందినవే జానపద కళలు మరియు జానపద నాటకాలు (folk drama ).

     ఆచార్య మొదలి నాగభూషణ శర్మ గారు  వారి ' నాటక రంగ పారిభాషిక పదకోశం'  నిఘంటువు లో  Folk Drama అంటే సామాన్య గ్రామీణ ప్రజలను వారి జీవనాన్ని ఆనందమయ జీవితంగా చిత్రించే నాటకం. తొలిరోజుల్లో గ్రామీణ ప్రజలు తమకోసమే సృష్టించుకున్న వినోదం అని పేర్కొన్నారు . 

     జానపద కళలు, నాటకం ఒక దానిలో ఒకటి అంతర్లీనంగా భాగమై ఉన్నాయి. చిందు భాగవతం, యక్షగానం లాంటి వాటిలో రామాయణం, మహాభారతం లాంటి మన పురాణాలను, అలాగే ఒగ్గు కథ, జముకుల కథ లాంటి వాటిలో కులపురాణలను folk form లో కథాగానముగా చెబుతారు. జానపద కళాకారులు Script ( లిపి/ముద్రాక్ష రాలు) లేకుండా అశువుగా ప్రదర్శిస్తారు. వారి వ్యక్తిగత భావాలకు సంబంధించిన వాచికాభినయం, సంజ్ఞ మరియు భంగిమలను  పాత్ర అభినయంకి జోడిస్తారు. ఉదాహరణకి వారు సంభాషణలో మధ్యలో ఒక్కొక్కసారి  ఇప్పటి వాడుక భాషనూ మరియు  లైట్, ఫ్యాన్ లాంటి  ఆంగ్ల భాషనూ కూడా వినియోగిస్తారు, వారికి అందుబాటులో ఉన్న దుస్తులను కూడా ఒక్కొక్కసారి వేసుకుంటారు, ఒక్కొక్కసారి ఎవరి వ్యక్తిగత తాహతకు తగ్గట్టు వారు ఆభరణాలు అంటే గధా, కిరీటం లాంటివి వేసుకునే వారు. 

     అప్పట్లో నాటకాలు సంబంధించి నాటక శాలలు లేదా ప్రత్యేక స్థలం అంటే ఇప్పటి వలె  థియేటర్ లేకపోవడం వల్ల వీటిని ఎక్కువగా ప్రజలు గుమికూడే ప్రదేశాలలో, చౌరస్తాలో, గుడి దగ్గర, ఎత్తైన స్థలంలో అంటే ఒక గడ్డపై  ఉండి అందరికి కనిపించేలా వీధులలో ప్రదర్శించడం వల్ల వీధి నాటకం అని లేదా వీధి భాగవతం అని పేరు వచ్చింది.

     గ్రామంలో ఉన్న ఒక్కక్క ఇంట్లో కళాకారులూ భోజనం చేసేవారు. ప్రదర్శన స్థలం పక్కనున్న ఇళ్ళలో వేషాలు వేసుకునేవారు. ప్రేక్షకులు అందరు వచ్చే వరకు సూత్రధారులు గణపతి, సరస్వతి, లక్షీదేవి  ప్రార్ధనలు చేసేవారు, ప్రదర్శనకు తోడ్పడిన వారిని పేరు పేరున గొప్పగా స్తుతించేవారు. గ్రామ పెద్దలు ముందు వరసలో కూర్చునేవారు. అందుబాటులో ఉన్న నూనె కాగడాలు , కర్ర దీపాలు వినియోగించేవారు. పాత్రలు ప్రవేశించినప్పుడు మెరుపులు రావడానికి గుగ్గిలాన్ని కాగడాలపై గుప్పించేవారు. రాత్రి మొదలై తెల్లవారుజాము దాకా ఈ ప్రదర్శన కొనసాగుతూనే ఉండేవి . పాత్రదారులు మూడువైపుల అభినయిస్తూ అందరికి వినిపించేలా బిగ్గరగా సంభాషణలు పలికేవారు. పాత్ర అభినయం దూరంగా ఉండేవారికి కనిపించేలా ఆంగిక అభినయం ఎక్కువగా ప్రదర్శించేవారు. వారే  పాడుతూ నృత్యం చేసేవారు.  ప్రదర్శన మధ్యమధ్యలో విసుకు రాకుండా హాస్య పాత్రలైనా మాధవి, చోకుదరు ద్వారా విచిత్రమైన లోక ధర్మాలను సాంఘిక ఆచారాలను ప్రవేశపెట్టి కడుపుబ్బా నవ్వించేవారు. ఈ విధంగా ఆనాటి జానపద నాటక కళ వైభవంగా నడిచింది. పల్లె ప్రజలకు విజ్ఞానాన్ని  వినోదాన్ని పంచాయి. 

     చరిత్రను పరిశీలిస్తేకి పూర్వమే వీధి నాటకం, బహురూపాలు, తెర నాటకాలను ప్రదర్శించినట్లు పాల్కుర్కి సోమనాథ్ రచించిన పండిత రాజ్య చరిత్రంలో  ఉదహరించారు. 

    మొదట్లో వీధి నాటకాలతో పాటు దేశి నాటకం, సాంప్రదాయాలు చాల వరకు శివ కవుల ఆధ్వర్యంలోనే వర్ధిల్లాయి. కారణం శైవమతం వాటి సాంప్రదాయాన్ని ప్రజలకు తెలియజేయుటకు దినిని ఒక ప్రచార సాధనంగా ఉపయో గించారు. శివకవులే అలాంటి రూపకాలను రాశారు , వాటికీ ప్రాచుర్యం కల్పించారు.  దీని వల్ల దేశీయ సాంప్రదాయ నాటకాన్ని శైవ మతస్థులు  సొమ్మని చెప్పొచ్చు.

    భరతుడు నాట్యశాస్త్రంలో దేశీరూపకాల వర్ణనలో కథ కల్పితమని, రెండు మూడు పాత్రలు కలిగిన ఏకాంతమని నటుడికి శృంగార రసం ప్రధానమని, గీతం నృత్యంతో కూడిన ప్రశంసలు ఉండవచ్చని పేర్కొన్నారు. 

                                     A.P. లో జానపద కళల/ జానపద నాటకాల పరిణామం
క్రీ. శ. 16వ శతాబ్దం నుండి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా యక్షగానాలు రచించబడ్డాయి. అప్పటి ధొర సముధ్రపు నటులు కూచిపూడి భాగవతులు జంగాలు మొదలైన వీధినాటకాలను, తెరనాటకాలను మరియు  బయలాటలను ప్రతి ఊరులోను ప్రదర్శించేవారు .

క్రీ. శ. 17వ శతాబ్దం యక్షగానానికి కూచిపూడి కలాపం సంబంధం ఏర్పడటం వాళ్ళ యక్షగానంలో వివిధ ప్రక్రియలు ఏర్పడ్డాయి. అలాగే ఆ కాలంలో తంజవూరు యక్షగానాలకు రాజాశ్రయం లభించింది.

క్రీ. శ. 18వ శతాబ్దం నాటికి యక్షగానం మీద కొన్నింటి పైన మార్గానాటకాల ప్రభావం కూడా గోచరిస్తుంది.

ఆంగ్లవిద్య వచ్చిన తర్వాత అంటే క్రీ. శ. 19వ శతాబ్దంలో తెలుగు నాటకం ఒక ప్రత్యేకమైన సాహిత్య కళగా ఉద్భవించింది.

    A.P. లో మొదటి జానపద దృశ్యకావ్యం అంటే కొరవంజినే, కొరవంజి అంటే ఎరుకలసాని. దీనికి పూర్వం మరే ఏ ఇతర కళారూపాలు ఉన్నట్లు చారిత్రక సాక్ష్యాలు  లేవు. కూచిపూడి వీధి నాటకం ఇది ప్రతి మారుమూల ప్రాంతంలోనూ అలాగే పెద్ద పెద్ద రాజుల ఆస్థానములలోను, దేవుళ్ళ కళ్యాణోత్సవాలలోను కూచిపూడి భాగవతుల ప్రదర్శన తప్పనిసరిగా ఉండేది. పురాణ కథలను తీసుకొని యక్షగాన వీధి నాటక రూపంలో భరతుడి నాట్యశాస్త్రాన్ని అనుసరించి ప్రదర్శించేవారు, ఇది కొన్ని శతాబ్దాలపాటు ప్రజల ఆదరణ పొందాయి.

    భాష ఒకటైన ప్రాంతాల వారిగా యాస వేరైనట్టు, ప్రదర్శన అంశం ఒకటైన దానిని ప్రదర్శించే కళారూపం వేరు వేరు పద్దతులుగా ఉన్నాయి. ఇప్పటికి కూడా 50 కి పైగా కులాలు ఈ జానపద నాటకాలపై ఆధారపడి ఉన్నాయి. ఒగ్గుకథ, జముకుల కథ, బుర్రకథ, చిందు యక్షగానం, పాఠం కథ, చిందు మాదిగలు, చిందు భాగవతం, పాండవ కథ మొదలైనవి, వీధి నాటకం, యక్షగానం  తూర్పు భాగవతం లాంటి కొన్నిfolk forms ని  మాత్రం కొన్ని గ్రామాలలో అన్ని కులాల వారు ప్రదర్శిస్తారు.   

A. P. [ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉమ్మడి రాష్టాల ] లో జానపద నాటకాలు 
1. వీధి భాగవతం / చిందు భాగవతం / యానాది భాగవతం / తూర్పు భాగవతం. 
2. యక్షగానం / చిందు యక్షగానం 
3. పగటి వేషాలు 
4. వాలకం / కమ్మ వాలకం ఇది వైజాక్ , అరకు వైపు ప్రదర్శిస్తారు.

తెలంగాణ రాష్టంలో 
         నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ చిందు భాగవతులు గొప్పపేరు సంపాదించారు. వీరు సారంగధర  నాటకాన్ని చాల రసవత్తరంగా ప్రదర్శిస్తారు.
         నల్గొండ, ఖమ్మం, వరంగల్ మరియు హైదరాబాద్ జిల్లాల్లో ఎక్కువగా నివసిస్తున్న ఒక సంచార తెగపేరు తెలగ దాసరులు వీరినే గంటె భాగవతులు అని కూడా అంటారు. వీరు ఈ కళనే జీవనోపాధిగా జీవనం కొనసాగిస్తున్నారు. పెట్రో మాక్సులైట్లు, ఎలక్ర్టికల్ లైట్లు లేని ఆ రోజుల్లో పెద్ద గరిటెలలో ఆముదం పోసి అందులో వత్తుల్ని వెలిగించి ఆ వెలుగులో వీధి నాటకాలను ప్రదర్శించేవారు. గంటె భాగవతులు రామనాటకం, గరుడాచలం, సావిత్రి, సిరియాళ మొదలైన పౌరాణిక యక్షగానాలను ప్రదర్శిస్తారు.

  20వ శతాబ్దంలో కూడా తెలంగాణాలో జానపద నాటకాల రచన, ప్రదర్శన సజీవంగా ఉంది. చేరివిరాల బాగయ్య బాలనాగమ్మ కథ,కాంబోజిరాజు కథ మొదలగు ఎన్నో రచనలు చేశారు. ఈయన తర్వాత తెలంగాణ యక్షగాన కవులుగా బూరుగుపల్లి సోదరులు పేరు గాంచారు. తెలంగాణలో యక్షగానాలు 100కి పైగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో కన్పిస్తున్న వీధి నాటకాలు, వీధి భాగవతాలు యక్షగానాలకు తోబుట్టువులు. కాలానుగుణంగా కథలలో మార్పులు వచ్చాయి,  కల్పిత కథలు ఇతివృత్తాలయ్యాయి. నేటి సామ్యవాద సిద్ధాంతాన్ని సమర్దిస్తూ వచ్చినటువంటి ఇతివృత్తం కల " పట్లోరి వీరప్ప క్రోదాపురి రైతు విజయం " అనే నాటకమే ఉదహరణ.
గమనిక : A. P. అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పటి విషయాలను ప్రస్తావించడం జరిగింది. 


Indian National folk theatre
1. Thraditional థియేటర్ దీనినే యక్షగానం అని కూడా అంటారు. యక్షగానం భారతదేశంలోని అనేక రాష్టాలలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటకలో ఎక్కువగా ఉన్నాయి, కానీ ఇపుడు కర్ణాటకలో బాగా ప్రాచుర్యంలో ఉంది.

2. North Indiaలో రామ్ లీల గుజరాత్ లో bavai, U.P. లో nautanki, West bengal లో Jathra ఇలా ఎన్నో అనేక రకాలైన భారతీయ ఫోక్ థియేటర్ ఉన్నాయి.

    Habib tanvir, Ebrahim alkazi వారు folk theatre పై గట్టి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా 1962 లో Ebrahim alkazi  NSD (National school of drama)కి director గా ఉన్నపుడు professional folk theatre పై ఎన్నో ప్రయోగాలూ చేశారు.  
 
    ఆధునిక భారతీయ నాటకరంగంలో ప్రాంతీయ జానపద శైలిలో వేయబడినదే  " హయవాదన " (written by Girish karnad) దీనిలో బుర్రకథ form ప్రదర్శించారు, అలాగే Ghashiram kothwal (written by Vijay tendulkar) ని తమాషా form ప్రదర్శించారు, Jabbal patel ఈ రెండింటికి దర్శకత్వం వహించారు. Karnad భారతీయ సంస్కృతి యొక్క జనపదంతో పాటు Brechnian యొక్క narrated విధానాన్ని భాగవతంలో ప్రదర్శించారు. Karnad folk లోని mask & music ని ఉపయోగించాలి అని ఆలోచిస్తున్నపుడు తట్టినదే "హయవాదన" ఇది ఒక cultural symbal. It's a rich resource of the native folk theatre ఈ folk tale లో జానపద నాటకం యొక్క mask, sound, curtain, the commentor, narrator, dolls, horse-man, story in story ఇలా అన్ని మేళవించిన ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించారు.

      B.V.Karnath చిన్నప్పుడు యక్షగానం, హరికథ మరియు ఇంతర జానపద థియేటర్ ద్వారా ప్రభావితం అయ్యారు. అందుకే వారి థియేటర్ స్టైల్ ని ఫోక్ థియేటర్ స్టైల్ అంటారు. ప్రతి ప్రాంతం లో ఆ ప్రాంతానికి చెందిన భాషలో అక్కడ నాటకీయ ప్రదర్శన జరగాలని చెప్పారు. A. P. లో సురభి బృందం వంటి professional theater ని చేయాలనీ ప్రదర్శించారు. ఏదేమైనప్పటికీ వారు సూచించిన సూత్రాలు, ప్రయత్నాలు చాల విజయవంతం అయ్యాయి. వీరు 100 కి పైగా నాటకాలకి దర్శకత్వం వహించాడు. అందులో సగం కన్నడంలో, 40కి వరకు  హిందీ లో దర్శకత్వం వహించారు, Macbeth అనే హిందీ నాటకాన్ని సంప్రదాయ యక్షగాన నృత్య నాటక రూపంలో దర్శకత్వం వహించారు. అలాగే Folk theater of Oriya, Bengal, Marathi, Kannada తదితర భాషా ప్రాంతాలలో జానపద  థియేటర్ మీద పనిచేశారు. వారు దీనిని ప్రేక్షకులకు పరిచయం చేసారు.
    Experimental modren theatre లో జానపద శైలిలో వచ్చిన మొదటి యక్షగానం అద్య రంగాచార్య కన్నడ లో రాసిన అనువాద నాటకం "కేలు జనమేజయ".

International Folk Theatre
జానపద నాటకం/ డ్రామాని  ఒక జాతి లేదా జానపద సమూహం సంప్రదాయ నియమాలు అభివృద్ధి చేసింది.
ఈ  పనితీరు యునైటెడ్ స్టేట్స్ లో సాపేక్షంగా అరుదుగా ఉంది, కొన్ని జానపద నాటకాలు టెక్సాస్  లో చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా పాత కాలంలోని మత డ్రామా నుండి వచ్చిన హిస్పానిక్ క్రిస్మస్ వేడుకల భాగంగా జరిగినది.
ఇది ప్రపంచ మత పరమైన నాటకం.
రెండవ జానపద డ్రామా, లాస్ పోశాదస్,  జోసెఫ్ మరియు మేరీ ఆశ్రయం కోసం వెతుకులాట అంశముపై కేంద్రిక్రుతమై ఫ్రదర్శించబడింది.  దీనిలో హాస్యం లెదు. డైలాగులన్ని  పాడబడ్డాయి.

Tuesday, February 15, 2011

My upcoming updating story captions

1. ఈ రాత్రి గడిస్తే చాలు ( ee rathri gadisthe chalu )
                              Some dangerous nights can't finish
                                                                 One should care of it.
2. Curfew ( కర్ఫ్యూ )
             Which we can't express in words.

3. వెంటాడే మృత్యువు (ventade mruthyuvu )
                               If death chases.

4.రాజకోట రహస్యం ( rajakota rahasyam )
                           Some secrets are very interestig.

5. Vayasuku pillalu manasuku peddalu ( publish in "vaarta" )
                                             Give a hand who is in..........

6. చేసిన తప్పు ( Chesina tappu )
                  Some times silly jokes push into dangerous position.


Hope I will update as soon as possible

Thank you
Readers

Tuesday, February 8, 2011

JAI TELANGANA ( poratam muddu , balidanam vaddu )జై తెలంగాణ (పోరాటం ముద్దు, బలిదానం వద్దు)

కుల, మత, భాష, లింగ, వయో భేదాలు లేకుండా అందరు కలిసి ఆనందగా , సంతోషంగా ఎవరి పని వారు చేసుకుంటున్నాం. ఇంతకి మాదేదో ఉమ్మడి కుటుంబం లేక  అనాధ శరణాలయమో కాదు. అతి విశాలమైన  స్థలం, మైదానం , నిజాం కట్టడాలు , బాస్కెట్ బాల్ గ్రౌండ్, కాంటీన్, వేళ్ళలో విద్యార్ధులు , నిష్ణాతులైన lecturers , సిటీ సెంటర్ లో కాలేజీ, అందుకే ఎంతో మంది మా కాలేజీ లో చదివే అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది మాది నిజాం కాలేజీ అని.
ఇక cut చేస్తే అంటే story నీ open చేస్తే


కాంటీన్ దగ్గర బ్యాచులు బ్యాచులుగా కూర్చున్నారు,class లకు వెళ్ళని the great student batch.
విద్యార్థి : ఒరేయి డిసెంబర్ నుంచి semister exams  కదారా! నీ దగ్గర notes  ఉంటె ఇవ్వవ ఈ రోజు night out చేస్తాను.
(ఇదంతా పక్కన కూర్చున్న egg puff లాగిస్తున్న ఇంకో విధ్యర్హి బృందం లోని బాస్కర్ విని.)
బాస్కర్ : అరె మామ మనకి కనీసం notes  తీసుకోవల్లన్న ఆలోచన కూడా రాలేదు , ఒరేయ్ నీ దగ్గర ఉందా?
చందు: హా... హ. హ్హ. ఎంటిరా అరటి పండు ఒలిచి బత్తాయి తిన్నట్టు  ఆ.. అర్ధం లేని మాటలు.
నలిని : అబ్బ .. చ్చా.  notes  లేదు సరికదా ! పైనుంచి పిచ్చి పిచ్చి సామెతలు ఒకటి.
చందు : అది సర్లేకాని నలిని నీ దగ్గర అయిన ఉందా?
నలిని : ( కోపంగా చందు తింటున్న egg puff లాక్కొని ) కడుపుకు egg puff తింటున్నావా? chicken  puff తింట్టునావా? ( అని చిన్నగా నవ్వి, ఆ puff కూడా లాగించేసింది, నలిని కూడా రాయలేదని అర్ధమై అందరు నవ్వారు.)
విశ్వ : హ.హ. hey నేను వెళ్లి రాజు ని అడిగోస్తనుండు. ( అని రాజుని వెతుకుతు లైబ్రరీ మెట్లపై  dull గా కూర్చున్న రాజు చూసి ,దగ్గరికి వేళ్ళి )
విశ్వ:  రాజు...! ఏంటి? dull గా  ఉన్నావు?
రాజు: ఏం లేదు .......( కొంచెంసేపు మౌనంగా ఉండి ) , అవును మన తెలంగాణా వస్తుందంటావా?
విశ్వ : ఒరేయి ఎందుకురా? నీకు అ అనుమానం? అయిన సెమెస్టర్ ఎగ్జామ్స్ వస్తునాయి. ముందు దాని గురించి ఆలోచించు.
విశ్వ : అది సర్లేగాని, నీ దగ్గర  history notes ఉంటె ఇవ్వవా. (టక్కున ఏదో గుర్తుకు వచ్చినవాడిలా  నవ్వి) అయిన నీ దగ్గర  ఉండక పోవడం ఏంటి, సిన్సియర్ & రెగ్యులర్ స్టూడెంట్ వి కదా!
రాజు: అవును ( బాధగా) ఇదిగో ( అంటూ notes ఇచ్చిన  తర్వాత) మన తెలంగాణా వస్తుందంటావా? ( అని మళ్ళి అడిగాడు )
విశ్వ : (సమాధానం చెప్పకుండానే )thanks  రా copy చేసుకొని ఇస్తాను. (అని notes తిరగేస్తూ వెళ్తున్న అతనికి అందులో అంతకు ముందే రాజు రాసుకున్న సుసైడే లెటర్ చదివి నిర్గాతపోతడు, రాజుని నిలదీసి అడుగుదాం అనుకుంటాడు, కానీ అలా చేయడం వల్ల లాభం లేదని అని ఆలోచిస్తూ తిరిగి అ లెటర్ని అందులో పెట్టగానే , రాజు కంగారుగా ఊరికి వచ్చి notebook ని లాక్కొని లెటర్ నీ తీసుకొని ,notes తిరిగి విశ్వ చేతిలో పెట్టి హడావుడిగా)
రాజు: వస్తాను రా class కి time అయింది .
(విశ్వ కి  ఏమి మాట్లాడాలో  తెలియక అలాగే చూస్తూ .. .రాజుకి అనుమాన రాకుడదని చిన్నగా నవ్వి .)
విశ్వ : ఏంటి లవ్ లెటర్?.
( రాజు వైరాగ్యంగా హూం... అని నిట్టూర్చి , బాధగా వెళ్ళిపోతాడు.)


మరుసటి దినం
విశ్వ & అతని స్నేహితులు రాజు దగ్గరికి వెళ్లి.
బాస్కర్ : మేము campus కి వెళుతున్నాము, నువ్వు వస్తావా?
రాజు: ఎందుకు
చందు : మొన్న suicide చేసుకున్న యాదయ్య  స్నేహితుడు అలీని  కలవడానికి వెళుతున్నాము.
రాజు: సరే వస్తాను.


మన హైదరాబాద్ సిటి , మెట్రో సిటి అయిన తర్వాత కోల్పోయిన ప్రకృతి అందాలు అన్ని సిటి సెంటర్ లో ఉన్న ఉస్మానియా university కాంపస్ లో కనిపిస్తాయి.గుబురుగుబురు చెట్లు , కిల కిల రాగాలు తీస్తూ పిచ్చుకలు , అందమైన నిజాం కట్టడం అయిన ఆర్ట్స్ కాలేజీ పైన శ్రద్ధగా classలు  వింటున్న పావురాలు , ఫ్రెండ్స్ వస్తే సినిమా కి రాకపోతే క్లాసుకి వెళ్దాం అని బస్సు స్టాప్ లో ఎదురుచూస్తున్న విద్యార్ధి ,విద్యార్థినిలు .ట్రాఫిక్ జాం తక్కువున్న కాంపస్ రోడ్లపై రయి...రయి.. మంటూ వెళ్తునారు విశ్వ & గ్యాంగ్.


రాజు : ఎందుకు వెళ్తున్నారు.
చందు : పాపం వాడి స్నేహితుడు చనిపోయాకా, పలకరించలేదు అందుకే.


Tagore auditorium ఎదురుగ ఉన్న landscape గార్డెన్ ముందు బండి పార్క్ చేసి లోపలి వేళ్ళి , పార్క్ లో ఓ మూల చెట్టు కింద ఒంటరిగా కూర్చున్న అలీని చూసి దగ్గరికి వేళ్ళి ఆప్యాయంగా హత్తుకొని, ఆ ప్రక్కనే ఉన్న బెంచిపై కూర్చుంటారు.


చందు : అసలు ఎలా జరిగిందిరా, ఎపుడు నవ్వుతు నవ్విస్తుండే వాడు , ఇలా సడన్ గా...

అలీ : (బాధగా )పాపం చాల పేదవాడు రా ,ఇలా క్షనికావేశంతో ప్చ్ ...
నలిని : అయిన educated అయ్యి ఉండి, ఇలా foolish గా ఆత్మహత్య చేసుకున్నాడు.
అలీ : ఉద్యమంలో  చాలా చురుగ్గా పాల్గొన్నాడు. కానీ రేపు, మాపు అంటుంటే ఇక వస్తుందో లోదో అని భయపడి, వాడి మరణంతోనైన తెలంగాణా తేవాలి అనుకున్నాడు అందుకే ( అంటూ ఏడ్చాడు ......)
చందు : ఉరుకోర...( అని తన కళ్ళలో వస్తున్న కన్నీటి ఆపుకుంటూ ) ఊరుకో ( అని భుజం తట్టాడు).
అలీ : ( కళ్ళు తుడుచుకుంటూ )లేదురా వాడు లేని లోటు తీరనిది క్లాసు లో , కాలేజీ లో , రూం ..అసలు నా లైఫ్ లోనే వాడిని మిస్ అయ్యాను అని తలుచుకుంటేనే బాధగా ఉందిరా. నా సంగతి వదిలేయి పాపం వాడి అమ్మానాన్నలని తలుచుకుంటే ఇంకా భాదేస్తుంది. వాడిది మా ఊరే మా ఇంటి పక్కనే వాడి ఇల్లు చినపట్నుంచి కలిసిపెరిగం, తిరిగాం . వాడి నాన్న పెద్ద వ్యవసాయదారుడు ,కాని వాడి చిన్నపుడే నీళ్ళు లేక , పొలం బిరుబడి పోవాడంతో  ఆర్దికంగా బాగా చిక్కి పోయారు, వాళ్ళ అమ్మకి పురిటి కర్చులకు  కూడా డబ్బులు లేకపోతె వాళ్ళ నాన్న కిడ్ని అమ్మి , ఆ డబ్బుతో హాస్పిటల్ పైసలు కట్టి వాడిని కన్నారు .వాడిని అల్లారుముద్దుగా కంటికి రెప్పల , ఎన్నో నోముల ఫలితంగా పుట్టిన బిడ్డ అంటూ , వాడె వారి ఆశగా ,జీవితంగా బ్రతికారు. ఎన్నో కష్టాలు పడ్డారు కాని ఆ కష్టనంత వాడిని చూస్తూ మర్చిపోయేవారు, " మేము ఎంత కష్టపడ్డ మా బిడ్డ కోసమే కదా " అనేది వాళ్ళ అమ్మ. వాడి తల్లి పాచి పని చేస్తూ , వల్ల నాన్న కూలి వెళ్తూ  వాడిని చదివిస్తున్నారు , ఎన్నోసార్లు వాడు పని చేస్తాను మీరు ఇంకేన్నలు నా కోసం కష్టపడతారు అంటే వద్దు బిడ్డ అనేవాళ్ళు . " మా కొడుకు పై చదువులు చదవాలి, దొరలగ బ్రతకాలి అయ్యా " అని ఎన్నోసార్లు  వాళ్ళ నాన్న నాకు చెప్తే " మీరు చూస్తూ ఉండండి వాడు చాల పైకి ఎదుగుతాడు , ఈ ఏడాది university top ten , వచ్చే ఏడాది university 1st వస్తాడు, మంచి ఉద్యోగం వస్తుంది, మీకు కష్టం ఉరికేపోదు " అన్నాను. వాడు కూడా ఎన్నోసార్లు నాతో " మా అమ్మకి నేనంటే ప్రాణం ఎపుడు నా గురించే ఆలోచిస్తూ ఆమె ఆరోగ్యం సంగతే మర్చి పోయింది.అమ్మని కంటి ఆసుపత్రిలో చూపించాలి , నాన్నకి మోకాళ్ళ నొప్పులు చూపించాలి. అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలి" అనేవాడు. అలాంటి వాడు తొందరపాటు తనంతో ఈలాంటి నిర్ణయం తీసుకోని, సరిదిద్దుకోలేని అతి పెద్ద తప్పు చేసాడు. (కనిళ్ళని తుడుచుకుంటూ,నిబ్బరంగా ) నీకు తెలుసా వాడు చనిపోయడు అన్న వార్త వినగానే వాడి అమ్మ పిచ్చిది అయింది. మొన్ననే మానసిక వైద్యశాలలో వేసాము. (అని ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడుస్తుంటే, అందరు కలిసి ఓదార్చారు). ఈ రోజే ఆంటీ ని చూడడానికి ఆసుపత్రికి వెళ్ళాలి.
నలిని : మేము వస్తాము పద .


ఆసుపత్రికి వేళ్ళి కౌంటర్లో యాదయ్య తల్లి ఎల్లమ్మ రూం నెంబర్ కనుకొని, ఆంటీ ఉన్న గదిలోకి వెళ్లారు. అక్కడ జుట్టంతా విరబోసుకొని , ముడతబడ్డ బట్టలతో , ఒంట్లో ప్రాణం లేనంత బక్కగా బాగా ఏడ్చినట్టు కంటి కింద చారలు చాల దిన పరిస్తితిలో ఉంది. పక్కన ఎవరో ఉన్నటుగా  " వదిన మా కోడుకి అరిసెలు అంటే పాణం అందుకే చేస్తున్న(నెల మీదే అరిసెలు ఒత్తుతూ, గాల్లో వేసి కాలుస్తుంది ), పాపం బిడ్డ సదువుతుంటే తిండి ధ్యాసే ఉండదు " అని మొక్కం మీద పిచ్చిగా పడ్డ వెంట్రుకల్ని సిగ వేస్తూ ఏవేవో కొడుకు గురుంచి తనలోతాను మాట్లాడుకుంటూ, చెబుతూ పని చేసుకుంటుంది. అందరు గుమ్మం దగ్గరే నిల్చొని ఆమెని అలానే చూస్తూ నిలబడ్డారు.


నర్సు : జరగండి. (నర్సు చూడగానే భయంతో )
ఎల్లమ్మ: వద్దు.... వద్దు (అని గట్టిగ అరుస్తూ ) బిడ్డ నొప్పి పెడ్తుంది, సూది వద్దు.( పిచ్చిపిచ్చిగా ) కావాలంటే ఇదిగో ఓ అరిసె తీసుకో.( అని పక్కనే ఉన్న గుడ్డ ముక్కను అరిసె అనుకోని నర్సు చేతిలో పెట్టింది.నర్సు సుడి మందు ఇవ్వడానికి ఆమె అసలు సహకరించాట్లేదు, అప్పుడు అలీ కల్పించుకుంటూ)
అలీ : అమ్మ నువ్వు అలా సుది తిసుకోపోతే యాదయ్య చాలా భాద పడతాడు, నిన్ను చూడడానికి రాడు.
ఎల్లమ్మ :గట్లన అట్లయితే ఇయి బిడ్డ ( అని నవ్వుతు సూది వేయించుకుంది. అ తల్లి ప్రేమని చూస్తూ అనుకోకుండానే వాళ్ళ అందరి కళ్ళు చెమ్మగిల్లాయి.) ఇపుడు చెప్పు నా కొడుకు ఎపుడోస్తన్నన్నాడు (అనగానే అలీ కట్లో నిల్లు తిరిగాయ), నువ్వెట్ల గున్నావ్ అయ్యా?
(అలీ ఏమి మాట్లాడలేక పొతే నలినే కాస్తంత సమయమైన ఆమెని సంతోష పెట్టాలని అనుకోని )
 నలిని :వస్తాడమ్మ తప్పకుండ..వస్తాడు, పరిక్షలు అయిపోగానే వస్తాడు ( అని దైర్యంగా చెప్పిన యాదయ్య ఇంకా ఎప్పటికి రాలేడని తెలిసి మనసులోనే భాద పడుతుంది )
ఎల్లమ్మ :నా కొడుకు బాగా సదువుతున్నాడ? పండక్కి దబ్బున రమ్మను , ఏలకి ఇంత బువ్వ తింటుండో లేదో " అని కొడుకు యోగక్షేమాల గురించి అడుగుతుంటే (అందరి గుండెలు తరుక్కు పోయాయి, రాజుకు వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చి , మా అమ్మ ఇలాగె అయితే అన్న ఆలోచన రాగానే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక పోయాడు, ఇంకా నా కొడుకు వస్తాడు అని ఎదురుచూస్తున్న అ తల్లి ఆవేదన , ఆశ అన్ని కలలే అని తెలిసి అందరు మనసులోనే కుమిలిపోయారు.ఎల్లమ మెల్లగా మత్తులోకి జారుకుంది. అందరు అక్కడి నుంచి బరువైన హృదయంతో బయటికి వచ్చారు.)


వారం రోజుల తర్వాత
రూం లో suicide లెటర్ పెట్టి, ఓ కాగితంలో జై తెలంగాణా అని రాసుకొని జేబులో పెట్టుకొని. దేవుడి పటానికి మొక్కుకొని , అందరితో కలిసి టిఫిన్ చేసి, అందరికంటే ముందుగానే కాలేజీకి వేళ్ళి బిల్డింగ్ మీదకి ఎక్కి దూకడానికి సిద్దమయాడు ,కానీ మనసులో ఎన్నో రకాల ఆలోచనలు ,అందరు గుర్తుకువస్తున్నారు, అయోమయంగానే బిల్డింగ్ చివరిదాకా వెళ్ళాడు.
బాస్కర్  : చావడానికి వచ్చావా?
( కంగారుగా వెనక్కి తిరిగి చూసాడు )
చందు : నీ చావుతో తెలంగాణా వస్తుందా?
రాజు:( ఏడుస్తూ ) వస్తుంది.
విశ్వ : వెళ్ళరా ( వరుసగా చచ్చిన వాళ్ళ పేర్లు చెబుతూ ) వీళ్ళందరూ చచ్చినందుకు తెలంగాణా వచ్చిందా?
పోనీ ఇప్పుడు  నువ్వు చస్తే వస్తుందా?
రాజు: లేదు నీకు తెలిదు, ఈ ఉద్యమం ఆగకుడదు అందుకే. ( రాజు మాటని పూర్తి అవకుండానే , కోపంగా )
విశ్వ : ఒరేయి నీలాంటి వాళ్ళు చస్తే ఉద్యమం రాదురా, నీలాంటి వాళ్ళు బ్రతికి పోరాడితే వస్తుంది.
బాస్కర్  : అయిన నీ చావుతో వచ్చే తెలంగాణ మా కొద్దురా. ( అని నికచ్చగా చెపాడు )
నలిని : ( convinence గా ) నువ్వే చూసావు కదా! యాదయ్య  చనిపోతే వాళ్ళ అమ్మ ఎలా పిచ్చిది అయిపోయిందో, నువ్వు కూడా మీ అమ్మకి కడుపుశోకం మిగిలిదమనుకుంటున్నావా? ఆమె ప్రాణం పన్నంగా పెట్టి నీకు ప్రాణం పోసింది ఇందుకేనా , ఇలా నీ జీవితం అర్దాంతరంగా ఆగిపోవడనికేన? (రాజు మనుసు కల్లుక్కుమంది )
విశ్వ : తెలంగాణా రోషాల గడ్డరా. భిక్షం ఎత్తి అడుకున్నట్టు, చస్తానని బెదిరించి తెచ్చుకోవడం కాదు, పౌరుషంతో పోరాడి తెచ్చుకుందాం. అసలు మన గడ్డపై ఇంత వరకు పిరికి పందల చచ్చిన వాళ్ళు ఎవరు లేరు తెలుసా? కొమరంభీం ,చాకలి ఎల్లమ్మ ,రాణి రుద్రమ్మ, మాదిగా ముత్తమ్మ, గొల్ల సత్తమ్మ, ఆరుట్ల కమలాదేవి, సర్వాయి పాపన్న, బందగి, దొడ్డి కొమరయ్య లాంటి మహామహులు పుట్టిన గడ్దర ఇది. నీలా పిరికితనంగా ఆలోచించి ఉంటె వాళ్ళు ఈరోజు ఇలా ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలేచేవారు కాదు, ఎంతో మంది మేలు జరిగి ఉండేది కాదు. కష్టాన్ని చూసి పిరికివారిల తప్పించుకోకుండ ఎదురు తిరిగి పోరాడిన సమర యోధులు అందుకే చరిత్రలో నిలిచి పోయారు.కాని నీల ఆత్మహత్య చేసుకొలేదు.
చందు :ఎలాగో చనిపోవాలని నిర్ణయించుకున్నావ్ కదా , అలాంటపుడు  నీ చివరి శ్వాస వరకు దర్జాగా పదిమంది చూసి గర్వించేలా పోరాడి చనిపో.. ఇలా పిరికి వాడిలా ఎవరికీ చెప్పకుండా దొంగచాటుగా చనిపోవడం ఎందుకు.
విశ్వ :(నిరుత్సాహంగా )నీలాంటి వాళ్ళు ఇలా చేయబట్టే డిసెంబర్ వస్తుందంటే, ఊర్లో ఉన్న తల్లితండ్రులు గుప్పిట్లో  గుండెను పెట్టుకొని బ్రతుకుతున్నారు.(ఏడుస్తూ)సంక్రాంతి కొత్త పంట వస్తుంది, కాని మా కొడుకు వస్తాడా, మా కూతురు వస్తుందా! అని తెలియక " మా చిడ్డ క్షేమంగా ఉండాల" అని రోజు దేవుడిని మొక్కుతున్నారు.
మా బిడ్డ ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతారు అని దూరమైన, వారి ఆర్తిధిక స్థితికి బారమైన ఇంత దురం పంపించి చదివిస్తున్నారు. కాని ఇలా తిరిగి రాని లోకానికి, ఇంత దూరంగా వెళ్తే...వాళ్ళు ఏమైపోతారు, ఒక్కసారైనా ఆలోచించావా? అక్క, చెల్లి, తమ్ముడు (దగ్గరికి వెళ్లి భుజం మీద చేయి వేసి) స్నేహితులం ...మేము ఏమైం పోతంరా . (అని బాధగా అడిగి , ఒక్క క్షణం ఆగి ) అయిన సమస్యలని పరిష్కార దిశగా ఆలోచించాలి, కానీ సమస్యను సమస్యగానే వదిలేసి, మరో సమస్యకి కారణం అయ్యి, జివితతం మాకు దుఖాన్ని మిగిల్చేల ఆలోచించవద్దు.
చందు : ప్లీజ్ రా. మా గురుంచి కూడా ఆలోచించండి ( అని వేడుకోలుగా అడుగుతూ ) దయచేసి నిన్ను అనాధ కాకుండా పెంచిన నీ తల్లితండ్రులను అనాధలు చేసి వెళ్ళకురా.( రాజుకి యాదయ్య ఆత్మహత్య చేసుకోవడం వల్ల పిచ్చిదైన ఎల్లమ్మ, అలీ గుర్తుకువచ్చి .రేపు నేను ఆత్మహత్య చేసుకుంటే నా తల్లితండ్రులు అనాదాలవుతారు అనిపించింది. వాళ్ళు నా మీద పెట్టుకున్న ఆశలు అడియశాలవుతాయి,అవును వీళ్ళు చెప్పేది వాస్తవం అనుకోని )
రాజు: మీరు చెప్పేది నిజమే కాని ( ఏడుస్తూ ...)  తెలంగాణా. ( విశ్వ రాజు కన్నీళ్ళు తుడుస్తూ )
విశ్వ : కలిసి పోరాడదం ,దానికున్న ప్రతిబంధకాల్ని చెధిద్దం. అయిన బ్రతికి సాదించలేనిది , చచ్చిపోయి ఎలా సాదిస్తం చెప్పు ( అనగానే రాజు విశ్వని గట్టిగ హత్తుకొని, గుండెలోని బారం తిరిపోయేల ఏడ్చి,అతను ఎంత పెద్ద తప్పు చేయబోయాడో తెలిసొచ్చి సిగ్గుతో తలదించుకున్నాడు.)
బాస్కర్ : ఇప్పటికైనా నువ్వు మారినందుకు చాల సంతోషంగా ఉంది ( అంటూ రాజులో వచ్చిన మార్పుకు అందరు ఆనందంతో ఒకరిని ఒకరు హత్తుకున్నారు) (నలిని,చందు, బాస్కర్  ఆ రోజు విశ్వ రాజు suicide లెటర్ చదివిన విషయం మాకు చెబితే , మేము వాడి అమ్మానాన్నలకి ఈ సంగతి చెబుదాం అంటే , వద్దని మమ్మల్ని వారించి)
---------->>>>
విశ్వ : " అలా చేయడం వల్ల అనవసరంగా వాళ్ళు కంగారు పడతారు, కాలేజీకి పంపారు , ఇంకెక్కడికి పంపించాలన్న భయపడతారు. అయిన ఇరవై నాలుగు గంటలు కాపలకాయడం కష్టం, ఆత్మహత్య చేసుకోవద్దు, అది తప్పు అని వాడికి తెలిసి రావాలి ,లేకపోతె ఎప్పుడు ఏం చేసుకుంటాడు అనేది  ఎవరు చెప్పలేరు, అసలు వాడిలో మార్పు రావాలంటే చనిపోవడం తప్పు అని, బిడ్డ చనిపోతే తల్లితండ్రులు పడే వేదన, మనస్తాపం. మానసికంగా క్రుంగిపోయే బందువుల , స్నేహితుల పరిస్తితి  అర్ధమయ్యేలా , యదర్దంగా చూపించాలి." (అని మాకు చెప్పి కావాలనే రాజుని ఆ రోజు కాంపస్ కి తీసుకుపోయాడు.)
(అలా వాడిలో సరైన మార్పు తీసుకొచ్చాడు " నీ ఆలోచన సరైంది విశ్వ! you had done a good job" అని మనసులో అనుకోని విస్వలాంటి వాడు స్నేహితుడు అయినందుకు గర్వంగా feel అవుతూ ముగ్గురు విశ్వకి సాల్యూట్ చేసారు)


కొన్ని రోజుల తర్వాత
ఉద్యమం ఉద్రుతమైంది , తెలంగాణ ప్రజలంతా ఉరుఉర నిరహరదిక్షలు , రిలేలు , పెన్ డౌన్లు మొదలైన పనులు చేస్తూ నిరసన తెలియచేస్తూ, తెలంగాణా కోసం పోరాడుతున్నారు.
మా కాలేజీ కూడా తెలంగాణా బ్యానర్ లతో, ముగ్గులతో, పాటలతో నిండిపోయింది .ఒక్కపుడు ఆత్మహత్య చేసుకుందామనుకున్న రాజు చురుకుగా ఉద్యమంలో పాల్గొంటూ , తెలంగాణా సాధన ఎలా సాధ్యమో , అసలు తెలంగాణా రాష్టం ఎందుకో కావాలో ప్రజలకి అర్ధమయ్యేలా ఆవగాహన కలిపిస్తు, ప్రజలలో ఉన్న అవాస్తపు అపోహలను, భ్రమలను పోగ్గేటేల ఉపన్యాసాలు ఇస్తూ, అతని ఉనికిని చాటుకుంటూ , ఇంకో పదిమందికి ఆదర్శప్రాయంగా నిలిచాడు.                                                                                            
                      నా ప్రియమైన విద్యర్తివిద్యర్తినిలు ఆత్మహత్యలు వద్దు.....please  
                      DO or DIE is out dated proverb , DO UNTILL YOU DIE  is present trend.
                                                             ఇంతకీ నేనొవరో చెప్పలేదు కాదు , నేను ఈ కథ రచయిత్రిని
                                                
                                                                                             R.సుచరిత
                                                                          M.A. THEATRE ARTS ( Final year )
                                                                                    NIZAM COLLEGE    








Published in NIZAMIAN magazine 2010-2011 

Saturday, February 6, 2010

JANMA BHOOMI (Mother land is heaven) జన్మభూమి


Dr. R. Sucharitha           జన్మభూమి 
                                     Janmabhoomi

రా
జేష్ హైదరాబాద్ లోని హాస్టల్ ఉంటూ బి.ఎ. చదువుకుంటున్నాడు.
కాలేజి లాస్ట్ పీరియడ్ లో ప్రిన్సిపాల్ వచ్చి “రేపటి నుండి పది రోజులు వరకు సంక్రాంతి సెలవులు” అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు.
రాజేష్ చాలా సంతోషంగా అదే రోజు సాయంత్రం తన ఊరికి వెళ్ళడం కోసం
బస్ స్టాప్ కు వెళ్లి బస్ కోసం ఎదురు చూడసాగాడు.
రాజేష్ తన ప్రక్కనున్న వ్యక్తిని పరిచయం చేసుకుని...
“ఎక్కడ చేయి ఎత్తితే అక్కడ బస్ ఆపుతామని రాసి ఉంటుంది. కాని అసలు బస్ స్టాప్ లోనే ఆగడం లేదు” అని బస్ స్టాప్ లో ఆగకుండా ముందుకెళ్ళి ఆగుతున్న బస్ ను ప్రక్కనున్న వ్యక్తికి చూపాడు రాజేష్.
“అంతేనా మెట్రో లైనర్ బస్ లో దిగేవారు దిగిన తర్వాత ఎక్కేవారు ఎక్కిన తర్వాత ఎవరూ పడి పోకుండా ఉండడానికి డోర్ పెడితే,
 ఆర్టీసీ వాళ్ళు మాత్రం దిగేవారు దిగకుండానే డోర్ పెడుతున్నారు. ఒక్కోసారి దిగేవాళ్ళు డోర్ లో ఇరుకుంటున్నారు కూడా!” బస్సు వచ్చే వైపు అసహనంగా చూస్తూ రాజేష్ తో అన్నాడు ప్రక్కనున్న వ్యక్తి.

రాజేష్ ఎక్కాల్సిన బస్సు రావడంతో బస్సు ఎక్కి JBS బస్ స్టాప్ కి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ రఘునాథ్ పల్లి బస్సు కదలడానికి సిద్దంగా ఉంది. రఘునాథ్ పల్లి అదే ఆఖరు బస్సు అవడంతో అందరు ఒకరినొకరు తోసుకుంటూ బస్సులోకి ఎక్కుతున్నారు. రాజేష్ అతి కష్టం మీద విండో పక్కన సీటు సంపాదించుకుని కూర్చున్నాడు. ఇంతలో ఏదో గుర్తుకు వచ్చానా వాడిలా తన షర్టు జేబులోంచి ఓ ప్యాకెట్ తీసి, విప్పాడు. అందులో ఉన్న ముక్కుపుడక చూశాడు.
అంతే...
తన ఆలోచనలు క్రితం ఏడాది సంక్రాంతిని గుర్తుచేశాయి.

                                      *****

రాజేష్ సెలవులకని ఊరొచ్చి బస్సు దిగుతుండగానే అతడి చిన్ననాటి స్నేహితులు రంగడు, కృష్ణ ఎదురుగా వచ్చారు.
“బాగున్నావా” అంటూ రాజేష్ కుడి చేతిలోని సూట్ కేస్ ను రంగడు తీసుకున్నాడు.
“నీ కోసమే ఎదురుచూస్తున్నాం...” అంటూ కృష్ణ రాజేష్
ఎడమ చేతిలోని బ్యాగ్ ను తీసుకున్నాడు.
“అంతా బాగున్నారా” అడుగుతూ ఊరు వైపు అడుగేశాడు రాజేష్.
“మేమంతా బాగానే ఉన్నావు” బదులిచ్చాడు రంగా.
“నీకో విషయం తెలుసా. మన రంగాకి ఆ పిచ్చయ్య కూతురు మల్లికి పెళ్లి నిశ్చయం అయింది. ఈ విషయం నీకు చెబుదాము అనేలోగా నువ్వే వచ్చేశావు” చెప్పాడు కృష్ణ.
అప్పటికే రంగా సిగ్గుపడడం ప్రారంభించాడు. అది గమనించిన రాజేష్ “అబ్బ ఎంత ముద్దుగా సిగ్గు పడుతున్నావురా” అంటూ రంగాకి చెక్కిలి గింతలు పెట్టాడు.
దారిలో అందరు రాజేష్ ని కుశల ప్రశ్నలు వేయవేసారు ఊరి వాళ్ళు.

పొయ్యి దగ్గర గొట్టం ఊదుతున్న కనకమ్మ రాజేష్ రావడాన్ని గమనించి గొట్టం కింద పెట్టి “బాబు రాజేష్ ఎలా ఉన్నావు?” అడిగింది రాజేష్ అమ్మ కనకమ్మ.
“నేను బాగానే ఉన్నానమ్మా. నువ్వెలా ఉన్నావు?” అడిగాడు రాజేష్.
“మాకేంటయ్య మేము బాగానే ఉన్నాం” అంటూ తన రెండు చేతులతో రాజేష్ ను ఆప్యాయంగ్గా పట్టుకొని “నా రాత్నాల కొండ” అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి “రా అయ్యా నీకిష్టమైన సర్వపిండి, సకినాలు చేశాను” అంటూ ఆ పిండి పదార్ధాలు ఉన్న డబ్బా తీసి రాజేష్ కి తినిపిస్తుంది.
“అంతా నీ కొడుక్కేనా మాకేమైనా ఉందా?”
అడిగాడు కృష్ణ.
“ఎందుకు లేదు” అంటూ వాళ్ళకి చెరో పల్లంలో పెట్టి
 వాళ్ళిద్దరి చేతుల్లో పెట్టింది కనకమ్మ.
“ఇంకా చాలమ్మా నువ్వు తిను” అంటూ సకినం
 అమ్మ నోట్లో పెట్టాడు రాజేష్.
బయటి నుంచి వీళ్ళిద్దరి ఆప్యాయతను చూసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి రాజేష్ నాన్న రంగయ్యకి.
రంగయ్యను చూసి “ఎప్పుడొచ్చావు నాన్న? ఏంటి ఆ కళ్ళలో నీళ్ళు” అని కంగారుగా అడిగాడు రాజేష్.
“ఏమి లేదయ్యా మీ తల్లి కొడుకుల ప్రేమ చూస్తుంటే నాకింత మంచి కొడుకు, పెళ్ళాం దొరకడం నా అదృష్టం. అందుకే ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి” అని రాజేష్ ను కౌగిలించున్నాడు రంగయ్య.
“బాబు ఎప్పుడు తిన్నావో  ఏమో? కాళ్ళు, చేతులు కడుక్కొని  రా... వేడి వేడి బువ్వ తిందువు గానీ” అంది కనకమ్మ.
“సరే అమ్మ” అని పెరట్లోకి వెళ్ళాడు రాజేష్.
రంగయ్య బకిట్లో నీళ్ళు ముంచి రాజేష్ ముందుంచాడు.
“ఏంటి నాన్న నేను మీకు సేవ చేయాల్సింది, అలాంటిది మీరు నాకు చేయడం ఏంటి?”.
“పర్వాలేదులేరా” చిన్నాగా నవ్వాడు రంగయ్య.
“ఆహ ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి. ఏమి కూర వండవమ్మ” అని కనకమ్మ బదులివ్వకముందే “ఏదైనా సరే ఇవ్వాళ్ళ మా అమ్మ చేతి వంట ఓ పట్టు పట్టాల్సిందే” అంటూ ఉవ్విళ్ళూరాడు రాజేష్.

అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చి గడప దగ్గర నిలుచున్నా వెన్నెలను చూసి “ఏంటి వెన్నెల ఎప్పుడొచ్చావు? ఏంటి విషయం?”
అడిగింది కనకమ్మ.
బుంగమూతి పెట్టి “అదేమి కాదు ఊరికే ఓసారి చూసి వెళ్దామని వచ్చా”  చిలుకపలుకులు పలికింది వెన్నెల.
“నా కోసం వచ్చి అబద్దం ఆడతావా?నిన్నో ఆటపట్టిస్తా చూడు” అని మనసులో అనుకుని పైకి మాత్రం “అమ్మా... వెన్నెల రోజు రాదూ కదా, మరి ఈ రోజే ఎందుకు వచ్చినట్లు...” అన్నాడు అమ్మ చేతి గోరుముద్దలు తింటూ... వెన్నెలని చూస్తూ ‘దీనికేం సమాధానం చెప్తావు’ అన్నట్లు బొమ్మ ఎగర వేసాడు.
“అదీ... అదీ...” కంగారుగా తడబడుతూ అంది వెన్నెల.
“నన్ను చూడ్డానికి వచ్చి ఉంటుందమ్మా” అన్నాడు రాజేష్.
వెన్నెలకి కోపం వచ్చింది.
“నేనేం నీ గురించి రాలేదు. మా కనకత్తను చూద్దామని వచ్చాను.” ధీమాగా కనకమ్మ భూజం మీద చేతులు వేస్తూ అంది వెన్నెల.
మరుసటి రోజు ఉదయం తెల్లవారు జామునే ఇంట్లోని పాతమంచాలు, కూర్చీలు తీసుకు వచ్చి భోగి మంటల్లో వేయసాగారు. చిన్న పిల్లలు కర్రలు, సిర్రగోనే తీసుకు వచ్చి మంటల్లో వేశారు. యువకులంతా మామిడి తోటలోకెళ్ళి మామిడి చెట్టెక్కి మామిడి ఆకును త్రుంచి ఇంటి ముందు తోరణాలు కట్టసాగారు.

అందరు కుంకుడుకాయ రసంతో స్నానం చేశారు.
రాజేష్ తలస్నానం చేయనంటే వెన్నెల, కనకమ్మ, రంగయ్య బలవంతంగా కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయించారు.
యువతులంతా పేడనీళ్ళతో వాకిలి అలికి రంగురంగుల ముగ్గులు వేసి మధ్యలో గొబ్బెమ్మలను పేర్చారు.
హరినాథుడు చెక్క భజన చేస్తూ... వీధి వీధి తిరుగుతుంటే పిల్లలు అతని వెంట అల్లరి చేస్తూ తిరగసాగారు. గుడిలో పూజారి పూజ చేసి ప్రసాదం అందరికీ పంచాడు. అందరి ఇళ్ళలో సంక్రాంతి స్పెషల్ నువ్వుల పులగం చేశారు. పిల్లలందరూ వాటిని తీసుకుని పంటపొలాల్లో ఆడుకుంటూ తినసాగారు.

గంగిరేద్దులోడు గంగిరేద్దిని తీసుకుని పిచ్చయ ఇంటి ముందుకు వచ్చి అక్కడున్న రంగాన్ని చూసి అతని ఇల్లు అనుకుని “అయ్యగారు చల్లగుండాలే” అనగానే గంగిరెద్దు తల ఊపింది...
“అయ్యగారు ముఖంలో పెళ్లి కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది” అనగానే గంగిరెద్దు మళ్ళీ తలూపింది...
ఇంట్లోంచి పిచ్చయ్య మల్లి బయటకొచ్చారు...

రంగ సిగ్గుపడుతూ మల్లి వైపు చూపుతూ “ఇదిగో ఈమెనే నేను పెళ్లి చేసుకోబోయేది” పిచ్చయని చూపిస్తూ “అదిగో ఆయనే మా మావయ్య” గంగిరేద్దులోడికి చెప్పాడు.

గంగిరేద్దులోడు  మనసులో ఇంకా ఏదైనా చెప్పి వాళ్ళ మెప్పుపొందాలనే తొందరలో “మీ మామ పేరు పిచ్చయ్య అయినా చాలా మంచోడు. పైగా వేరుశనగంతా పిచ్చి కూడా లేదు” అని నాలుక కరుచుకున్నాడు.
ఇంతలో దానికి కూడా గంగిరెద్దు తల ఊపింది...
“సాల్ సాల్ లే
 నీ సోది” కోపంగా అని మల్లితో...
“మల్లి ఆ బియ్యం డబ్బా మీదున్న బట్టలు తెచ్చివ్వు” అని చెప్పి  పొలంవైపు కదిలాడు పిచ్చయ్య.

గంగిరేద్దులోడు కనకమ్మ ఇంటి ముందుకొచ్చాడు.
“అమ్మగారు చల్లంగుండాలే... అమ్మా మీ ఇంట్లోకి మహలక్ష్మి రాబోతుంది” అన్నాడు గంగిరేద్దులోడు.
కనకమ్మ సంతోషంగా “ఎంత మంచి మాట చెప్పావు ఉండు” అంటూ ఇంటిలోకి వెళ్ళి రెండు దోసీల్లు బియ్యం తెచ్చి అతని సంచిలో పోసింది.

ఆ రోజు సాయంత్రం చెరకు తోటలో చెరకు చెట్టుకు ఒరిగి వెన్నెల కోసం ఎదురుచూస్తున్నాడు రాజేష్. కాసేపటికి వెన్నెల వచ్చింది .
“ఏంటీ వెన్నెల ఇంత లేటైంది?”  అడిగాడు రాజేష్.
“అది సరేగాని నిన్న సాయంత్రం నీకోసం మీ ఇంటికొస్తే అత్తముందు నన్ను ఆటపట్టిస్తావా?” చిరు కోపంగా రాజేష్ బుగ్గగిల్లింది వెన్నెల.
రాజేష్ ఆమె చేతుల్ని పట్టుకొని ఊపుతూ ముందు కదిలాడు. ఆమె అడుగులు వెనక్కి వేస్తూ అతని కళ్ళలోకి సూటిగా చూడసాగింది. అలాగే వెనక్కి వెళ్లి చెరకు చెట్టుకు ఒరిగారు.
“వెన్నెలా!  పల్లెటూరి అందాలను తలపించే నీ చీరకట్టు. నాజూగ్గా ఉండే నీ నడుము, అమాయకమైన నీ మోము” అంటూ నుదుటి మీద ముద్దు పెట్టాడు... వెన్నెల సిగ్గు పడింది.

“మృదువైన నీ పాదాలకి మువ్వలు... పొడవైన నీ చేతులకి గాజులు... చెవులకి కమ్మలు చాలా అందంగా ఉన్నాయి.” అంటూ చెక్కిలి మీద ముద్దు పెట్టాడు. ఆమె ముక్కును గమనించి “అవును ఏంటి మొన్నటి వరకు ముక్కు పుడక ఉండేదిగా? ఏమైంది” ప్రేమగా ప్రశ్నించాడు రాజేష్.
వెన్నెల అతని చొక్కా గుండీలు తీస్తూ... పెడుతూ “అదీ మొన్న స్నానం చేస్తుంటే ఎక్కడో పోయింది. ఈ విషయం ఇంకా మా నాన్నకి తెలీదు” కొంచెం బాధపడుతూ చెప్పింది.
“పోనీలే...
ఈ సారి నేను సిటీ నుంచి వచ్చేటప్పుడు నీకో మంచి ముక్కు పుడక తెస్తాను” అంటూ నిటారుగా ఉన్న ఆమె ముక్కుమీద ముద్దు పెట్టాడు.
వెన్నెలను తన కౌగిట్లో బందిచాడు. ఆమె సిగ్గుల మోగైంది.
“వెన్నెలా ఈ చేరకుకంటే నీ పెదాలే తియ్యగా ఉంటాయి... తెలుసా...” అంటూ పెదాలపై ముద్దు పెట్టాడు.

                                      *****

“రఘునాథపల్లి దిగేవారు దిగండి” అన్న కండక్టర్ అరుపుతో రాజేష్ తన ఆలోచనలలోంచి బయటికొచ్చాడు. బస్సుదిగి తన స్నేహితులు కోసం చూసిన రాజేష్ కి ఎవ్వరు కనిపించకపోవడంతో ఒంటరిగానే ఊరి వైపు అడుగులు వేసాడు.
“ఏంటి ఊర్లో ఎవ్వరు కనిపించడం లేదు” అనుమానంగా మనసులో అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు.

బోసిగా ఉన్న తన ఇంటిని చూసి ఆ ఊరి సర్పంచ్ అయిన శంకరయ్య దగ్గరికెళ్ళి ఊర్లోవాళ్ల గురించి, తన వారి గురించి ఆరా తీసాడు రాజేష్.

“మీవాళ్ళే
కాదు,  పంటలు పండక చాలా మంది పట్నానికి వలస పోయారు. నీకోసం నిన్నటిదాకా క్రిష్ణగాడు చూసిచూసి నువ్వు రాకపోవడంతో వాడు కూడా వెళ్లిపోయాడు. అవును ఇన్ని రోజుల్నుంచి రాలేదే?” అని రాజేష్ ని ప్రశ్నించాడు సర్పంచ్.

“ఇప్పుడు నేను ఫైనలియర్ కదా!  స్టడీస్ ఎక్కువగా ఉండటంతో రాలేక పోయాను. అయినా నేను ఇంటికి రెగ్యులర్ గా లెటర్స్ రాస్తూనే ఉన్నాను. కాని వీళ్ళు నాకెప్పుడు ఈ విషయం చెప్పలేదు.
ఇంతకు వాళ్ళు సిటిలో ఎక్కడున్నట్లు?” అడిగాడు రాజేష్.
“ఏదో జీడిమేట్లంట
బాబు” చెప్పాడు సర్పంచ్.
“సరే నేను మళ్ళీ సిటికి వెళ్తాను సంక్రాంతి అంటే సరదాగా
 సందడిగా ఉంటుందని ఆనందంగా గడపొచ్చని ఇక్కడికి వచ్చాను. కాని ఇక్కడి వాళ్ళంతా పంటలు లేక పట్నానికి వలస పోయారు. వాళ్ళని ఎలాగైనా ఒప్పించి తిరిగి మన ఊరికి తీసుకువస్తాను. అప్పుడే మన ఊరికి నిజమైన సంక్రాంతి” అని వెంటనే సిటీకి వెనుదిరిగాడు రాజేష్.

జీడిమెట్లలో బస్సు దిగి రెండు కిలోమీటర్లు నడిచిన స్లంమ్ ఏరియా వచ్చింది. చలి మంచుకన్నా గుడిసేల్లోంచి వస్తున్న పొగ దట్టంగా అలముకొని ఉంది. అతి కష్టం మీద వెన్నెల వాళ్ళ గుడిసెను తెలుసుకుని అక్కడికి చేరుకున్నాడు రాజేష్.

చిరిగినా బట్టలతో మసి అంటిన చేతులతో నొసలు మీద వాలిన వెంట్రుకలను పైకి లేపుకుంటూ “ఎవరు?”
 అంది వెన్నెల తన గుడిసె ఎదురుగా నిలబడి ఉన్న రాజేష్ ని సరిగా పోల్చుకోలేక.
“నేను రాజేష్ ను,
 ఏమిటి వెన్నెల ఎలా ఉండే దానివి? ఎలా అయిపోయావు? మన వాళ్ళంతా ఎక్కడున్నారు?” బాధాగా
అడిగాడు రాజేష్.
“నువ్వా రాజేష్...
లోపలికిరా కూర్చో” ఆశ్చర్యపోతూనే అంది వెన్నెల.
“అమ్మా వెన్నెల నువ్వు పనిచేసే ఇంట్లో అయ్యగారు బట్టలు ఇస్తానన్నారు తీసుకొచ్చావా?ఒకే జతను మార్చిమార్చి వేసుకోవడం కష్టమవుతుంది” అంటూ గుడిసెలోకి అడుగు పెట్టాడు పిచ్చయ్య.
ఎదురుగా ఉన్న రాజేష్ ని చూసి భావోధ్వేగానికి గురైయ్యాడు.
ఏంటి పిచ్చయ్య ఒకప్పుడు గంగిరేద్దులోడికే బట్టలు దానం చేసిన నువ్వే బట్టలు అడుక్కునే పరిస్థితికి వచ్చావా?” బాధగా, ఆశ్చర్యంగా అడిగాడు రాజేష్.

“ఏం చెయ్యమంటావు రాజేష్ పట్నం వెళ్లి ఏదో ఒక ఫ్యాక్టరీలో ఏదో ఓ చిన్న ఉద్యోగం చేయకపోతామా?  అన్న ఆశతో మన ఊరోల్లంతా పొట్టచేత పట్టుకుని పట్నానికి వచ్చాం. కాని తీర ఇక్కడికొచ్చాక తెలిసింది. ఎక్కడెక్కడి నుంచో  జనం  మాలాగే ఇక్కడికి తరలి వచ్చారని. ఇంతమంది రావడం వల్ల ఏ ఫ్యాక్టరీలో పని దొరక్కపోగా చివరకు తట్టమోసే కూలీలుగా, హోటల్లో చిప్పలు కడిగే సర్వంట్లుగా, ఇంకొందరయితే ఏ పని దొరక్క రోడ్డు పక్కన బిచ్చగాళ్ళుగా తయారయ్యారు. ఇందంతా మా తలరాత” బాధతో అన్నాడు  పిచ్చయ్య.
గుడిసె బయటకి వెళ్లి ఉబికి వస్తున్న కనీళ్ళు తుడుచుకున్నాడు పిచ్చయ. రాజేష్ అతని వెనుకే వెళ్లి భుజం మీద చేయి వేసి ఓదార్చాడు.
అప్పటికే మధ్యానం అయ్యింది అందరు తినడానికి వారివారి గుడిసెల దగ్గరికి వచ్చారు. అందరు రాజేష్ ని గమనించరు.
రాజేష్ వాళ్ళందరిని ఉద్దేస్తూ చెప్పడం మొదలు పెట్టాడు.
మీలా గ్రామం వదిలి ఇలా పట్నాలకు వలసగా వచ్చి చాలామంది తప్పు చేస్తున్నారు. * జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి * అన్నట్లు కన్నా తల్లిని,  ఉన్న ఊరిని వదిలి రాకూడదు. ఇలా రావడం వల్ల అటు పల్లెలు బీడుపడి పోతాయి. ఇటు పట్నాల్లో కిక్కిరిసిన జనాభాతో జల, వాయు, కాలుష్యం ఎక్కువవుతుంది. స్థలం సరిపోక చాలా అంతస్తులు కడుతూ విచ్చల విడిగా వేయిస్తున్న బోరు బావుల వల్ల భూగర్బ జలాలు అంతరించి భూకంపాలు వచ్చే అవకాశం కూడా ఉంది. జల, వాయు, వాతావరణ కాలుష్యం కారణంగా వింత వింత భయంకర రోగాలు కలుగుతాయి. అధిక జనసాంద్రత కారణంగా నిరుద్యోగం పెరిగి ఆకలి చావులు చావాల్సి వస్తుంది. అందుకే మన ఊరికి వెళ్లి పోదాం రండి” అన్నాడు రాజేష్.

అది సరే అక్కడ పంటల్లెకే కదా! మేమందరం ఇక్కడికి వచ్చాం. మళ్ళి తిరిగి వెళ్ళి ఎలా జీవించగలం.” సందేహించాడు పిచ్చయ్య.

“పనికి ఆహారం లాంటి పతకాలు ఉన్నాయి కదా! మన చెరువులో పూడిక తీసి, రోడ్లు మరమ్మతులు చేసి మొక్కలను నాటి పెంచి మన గ్రామాన్ని ఒక నందన వనంగా మార్చవచ్చు. కష్టమో నష్టమో మన ఊరిలో ఉంటూ సమిష్టిగా గ్రామాభివృద్ధికి కృషి చేద్దాం. రైతే రాజు అన్నట్లు రైతు ఎప్పుడు రాజుగానే ఉండాలి. అందుకే మనమందరం ఈ రోజే మన ఊరికి వేల్లిపోదం రండి” అందరికి ఆవగాహన కలిగేల  చెప్పాడు రాజేష్.

“అవును రాజేష్ నువ్వు చెప్పింది నిజమే. మనమందరం మన ఊరికి వెళ్ళిపోదాం పదండి” అక్కడ గుమికూడిన తమ ఊరి వారిని ఉద్దేశించి అంది మల్లి.
“మనం కూడా మన ఊరికి వెళ్దాం పదండి రా”  అన్నారు ఇతర గ్రామస్తులు.
అందరు మూటలు సర్దుకుని తమ తమ ఊర్ల కు వెళ్లి పోయారు.

ఆ మరుసటి దినం అక్కడ చలిమంచు తప్ప...
పొగ మచ్చుకైనా లేదు...

                                               *** జైహింద్ ***

writer email id: risingstar4tomorrow@gmail.com

About Me

My photo
Dr. Sucharitha Ph.D. Theatre arts Actress Director Dancer Violinist

Followers

Total Pageviews